మహబూబాబాద్ : పాము కాటుకు గురై చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ బుడగ జంగాల కులానికి చెందిన కిన్నెర మేఘమాల(9) అనే చిన్నారి రోజులాగే ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటువేయగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని ఆదివారం గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. బాలిక మృతితో అమ్మాపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.