మహబూబాబాద్ : మారిన పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంట సాగు అధిక ప్రాధాన్యమిస్తున్నది. అందులో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ వద్ద ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కోసం స్టడీ టూర్ బస్సులను జిల్లా కలెక్టర్ శశాంక జెండా ఊపి ప్రారంభించారు.
200 మంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని ఆయిల్ ఫాంమ్ సాగును పరిశీలించినున్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ పాల్గొన్నారు.