మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న
డోర్నకల్, జూలై 30 : పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న సూచించారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు రాజు తండాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల శుభ్రతతో నే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రజలు తమ ఇం టి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, నీటి నిల్వలు లేకుం డా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో సీతారామ్, వస్రాం, అంగ న్ వాడీ టీచర్ విజయ, ఆశ కార్యర్తలు పాల్గొన్నారు.
శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
గార్ల: కరోనా కష్ట కాలంలో పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ నాయక్ సూచించారు. ఫ్రైడే డ్రైడేను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పంచాయతీ పరిధిలోని 14 వార్డుల్లో వీధులను శుభ్రం చేశారు. గోలాల్లో నీటి నిల్వలను తొలగించారు. తడి పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జీ లక్ష్మణ్, ఆశ కార్యకర్తలు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి
దంతాలపల్లి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని, ఆద ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని డీఆర్డీవో రఘువరన్ సూచించారు. శుక్రవారం మండలంలోని వేములపల్లిలో ఫ్రైడే డ్రైడేలో పాల్గొని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారంలో ఒక్క రోజు ఇంటి పరిసరాలను శుభ్రపర్చుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందించాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి రికా ర్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం చ్ నాగిరెడ్డి వసంత, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, అంగన్ వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నెల్లికుదురు : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మండల మెడికల్ ఆఫీసర్ వేదకిరణ్ సూచించారు. మండలంలోని పెద్దతండాలో శుక్రవారం ఉచిత వైద్య శిబి రం నిర్వహించారు. 79 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, కొవిడ్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనతంరం గ్రామంలో ఫ్రైడే-డ్రైడే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరమేశ్, ఉపసర్పంచ్ యాకేందర్, వైద్య సిబ్బంది నాయిని శ్రీనివాస్, జీ రవి, రజిత, ప్రియాంక, ఆశ కార్యర్తలు పాల్గొన్నారు.
నర్సింహులపేట: ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీవో సోంలాల్ సూచించారు. శుక్రవారం ఫ్రైడే-డ్రైడే సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ఇంటి పరిసరాల్లో ఉన్న నీటి నిల్వలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు శంకర్గౌడ్, రజితారెడ్డి, నర్సయ్య,యాకన్న, సురేశ్, మగ్తి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
చిన్నగూడూరు: పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యమమని పీహెచ్సీ వైద్యాధికారి రవికుమార్, ఎంపీడీవో సరస్వతి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నర్సుబాయి, కార్యదర్శి అజీమ్, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.