మహబూబాబాద్, జూలై 24 : హరితహారంతో పట్టణాలకు సరికొత్త శోభ సంతరించుకుంటున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మునిసిపాలిటీ శివారు గాయత్రీగుట్ట సమీపంలోని జాతీయ రహదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్లో కలెక్టర్ అభిలాషా అభినవ్, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎఫ్వో రవికిరణ్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి పెరుమాళ్ల దశరథం, ఎఫ్డీవో కృష్ణమాచారి పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవ మనుగడ
కురవి : మొక్కలతోనే మానవ మనుగడ సాగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దిలీప్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మైనార్టీ కళాశాలలో ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పుష్పజారెడ్డి, డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
కొత్తగూడ : ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటాలని ఎస్సై అజ్మీర సురేశ్ పిలపునిచ్చారు. మండలంలోని గుంజేడు ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో కరమ్సింగ్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలి
పెద్దవంగర : ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని ఎంపీడీవో శేషాద్రి అన్నారు. మండల కేంద్రంతో పాటు అవుతాపురం గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీవో యాకయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రాచంద్రయ్యశర్మ, సర్పంచ్ మంజుల, పంచాయతీ కార్యదర్శులు, టీఏ సురేశ్నాయక్, నాయకులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి రక్షించాలి
తొర్రూరు, జూలై 24 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రక్షించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బేతి సంతోష్కుమార్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కల పెంపకంతో వాతావరణ సమత్యులత ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి డాక్టర్ బీ హతిరామ్, అధ్యాపకులు వెంకటరమణ, రమేశ్, రాధిక, రజిత, సిబ్బంది దేవేందర్, రవీందర్, పరమేశ్వర్ పాల్గొన్నారు.