ఆదిలాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాలు, పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పచ్చదనం, సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా పలు కార్యక్రమా లు చేపట్టారు. గతంలో మూడు దఫాలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కాగా, ఈ సారి కూడా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై తమ గ్రామాలు, వీధుల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం తమవంతు సహకారం అందించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మండలానికి, వార్డుకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరు ఆయా చోట్ల పనులను పరిశీలిస్తూ, ఉన్నతాధికారులకు నివేదికలను అందజేస్తున్నారు. వానకాలం కావడంతో గ్రామాలు, పట్టణాల్లో అపరిశుభ్రత నెలకొని ఉంటుంది. దీంతో ముఖ్యంగా పారిశుధ్య పనులపై దృష్టి పెట్టారు. తద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీకో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను అందజేయగా, వాటి ద్వారా అవసరమైన పనులను చేపట్టారు.
ప్రగతి పనులతో సమస్యల పరిష్కారం..
పల్లె ప్రగతి పనుల్లో భాగంగా ఇప్పటికే తొ మ్మిది రోజులు పూర్తయ్యాయి. మొదటి రోజు గ్రామ ప్రగతి నివేదికలు ప్రజలకు తెలియజేశారు. ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. శిథిలాలను తొలగించి రోడ్లు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. రెండు, మూడో రోజు నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల్లో కలుపు మొక్కలను తీసివేశారు. మురుగు కాల్వల్లో పూడిక తీయడం తో పాటు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భవనాల వద్ద పిచ్చి మొక్కలు తొలగించారు. నాలుగో రోజు యువజన, మహిళా సంఘాల భాగస్వామ్యంతో శ్రమదానం చేశారు. చెత్తకుప్పులు, సర్కారు తు మ్మలు, ముళ్ల పొదలను తీసివేశారు. ఐదు రోజు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో శుభ్ర పర్చడం, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు. గతంలో నాటిన మొక్కలు వివిధ కారణాలతో ఎండిపోగా, వాటి స్థానంలో కొత్తవి నాటారు.
వ ర్షాకాలంలో కలుషితమైన నీటిని తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తాగినీటి ట్యాం కులు శుభ్రం చేయడంతో పాటు పైపులైన్ల లీకేజీలను సరిచేశారు. ఏడో రోజు వంగిపోయిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను సరిచేయడంతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లోని వీధుల్లో విద్యుద్దీపాలను బిగించారు. ఎనిమిదో రోజు ఘన వ్యర్థాల నిర్వహణ, వైకుంఠధామాల చుట్టూ మొక్కలు నాటి బయో ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. తొమ్మిదో రోజు శుక్రవారం సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా డ్రై డే నిర్వహించారు. గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చూడడంతో పాటు దోమల నివారణ కోసం చర్యలు చేపట్టారు. ఆఖరి రోజున పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను అధికారులు స్థానికులకు తెలియజేస్తారు. పారిశుధ్య కార్మికులను సన్మానించడంతో పాటు తమ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయిస్తారు.
ఆయా జిల్లాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివిధ చోట్ల పాల్గొన్నారు. ఆయా చోట్ల ప్ర భుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రా మన్న, రాథోడ్ బాపురావ్, విఠల్ రెడ్డి, రేఖానాయక్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, దివాకర్రా వు, దుర్గం చిన్నయ్య, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.