సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ డ్రాగా ముగిసినా విజేతను నిర్ణయించేందుకు మార్గాన్ని కనుగొనాలని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఐసీసీకి సూచించాడు. ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో సన్నీ చెప్పాడు.