నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లయి నిండా 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. వేల్పూరు మండలం పచ్చల నడుకుడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విభేదాల కారణంగానే భార్యాభర్తలు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 13న యువతీయువకుడికి వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరిని కుటుంబీకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.