హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణలో క్రికెట్ను మరింతగా విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లాలకు చెందిన వారికి హెచ్సీఏలో సభ్యత్వం కల్పించారు. దావ సురేశ్ (జగిత్యాల), కలకుంట్ల మల్లికార్జున్ (సిద్దిపేట), వాల శరత్చంద్ర (మంచిర్యాల), మాటం భిక్షపతి (సంగారెడ్డి), బుద్దుల శ్రవణ్రెడ్డి (వికారాబాద్), దాదన్నగారి సందీప్కుమార్ (కామారెడ్డి) హెచ్సీఏ ఏజీఎమ్లో సభ్యులుగా చేరుస్తున్నట్లు అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ శనివారం ప్రకటించారు.