టెహ్రాన్: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. జూన్ 18వ తేదీన జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో ఆయన లీడింగ్లో ఉన్నారు. అత్యంత టైటిగా సాగుతున్న కౌంటింగ్లో.. మరో ముగ్గురు నేతలపై ఆయన ఆధిప్యం కొనసాగుతున్నది. గతంలో ఇరాన్ అత్యున్నత న్యాయమూర్తిగా చేశారు. సాంప్రదాయ విలువలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇరాన్లో దేశాధ్యక్షుడిని అధికారిక ర్యాంకింగ్లో రెండవ వ్యక్తిగా పరిగణిస్తారు. ఇరాన్ సుప్రీం నేత ఆ దేశానికి ప్రథమ వ్యక్తి. కానీ స్వదేశీ, విదేశీ విధానాల్లో అధ్యక్షుడికి కీలక పాత్ర ఉంటుంది. అయితే అన్ని విషయాలపై సుప్రీం నేత అయోతుల్లా అలీ ఖమేనీదే తుది తీర్పు ఉంటుంది. ఇప్పటి వరకు 2.86 కోట్ల ఓట్లను లెక్కించారు. దాంట్లో 1.78 కోట్ల ఓట్లతో రైసి లీడింగ్లో ఉన్నారు. 60 ఏళ్ల ఇబ్రహీం రైసి .. ప్రాసిక్యూటర్గా ఎక్కువ కాలం పనిచేశారు. 2019లో సుప్రీం చీఫ్గా ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల్లో రౌహనీ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. అవినీతిపై పోరాటం చేస్తానని, దేశ ఆర్థిక సమస్యలను రూపమాపనున్నట్లు రైసీ తెలిపారు.