కుత్బుల్లాపూర్, జూన్ 17 : వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లో నాలా పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ 131 డివిజన్లోని గణేశ్నగర్లో స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలా పరివాహక ప్రాంతాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్తో పాటు వివిధ శా ఖల అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. వ ర్షాకాలంలో వరద సమస్య పరిష్కారానికి నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, వెడల్పు పనులకు శ్రీకారం చుట్టాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతకు సూ చించారు. నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్, పురపాలక శాఖామం త్రి కేటీఆర్లు ప్రత్యేక దృష్టి పెట్టా రని, ఇదే క్రమంలో ప్రస్తు తం కురిసే వర్షాలకు లోతట్టు, నాలా పరివాహ క ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలకు ఎదురయ్యే పలు సమస్యలను సకాలంలో పరిష్కరించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు సాగాలని సూ చించారు. దీనికి తోటు నాలాల అభివృద్ధికి కోట్ల రూపాయాలను వెచ్చించిందని, నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా అన్నీ రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావు, ఎస్సి శంకర్నాయక్, డీసీ మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, డీఈ పాపమ్మ, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దూదిమెట్ల సోమేశ్యాదవ్, కిశోర్చారి, సత్తిరెడ్డి, కాలనీ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.