సిటీబ్యూరో, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్ కారణంగా కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. అనేక సందేహాలతో భయంభయంగా జీవిస్తున్నారు. అలాంటి వారికి ధైర్యం చెప్పి.. మానసికైస్థెర్యం కల్పిస్తున్నారు తెలంగాణ సైకాలజిస్టులు. మానసికంగా ఇబ్బందులు పడేవారికి ఉచితంగా ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 30 మంది సైకాలజిస్టులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 10 న ప్రారంభమైన ఈ సేవలతో ఇప్పటి వరకు 615 మంది ఒత్తిడి నుంచి బయటపడ్డారు. కాల్ చేస్తే చాలు..ఆందోళనలు సమసిపోయేలా ధైర్యాన్ని నింపుతూ.. ఉపశమనం కలిగిస్తున్నారు. రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మానసిక వైద్య నిపుణులు తెలిపారు.