హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ సాఫీగా సాగుతున్నదని రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. శనివారం బహదూర్పుర, మల్లేపల్లిలోని వాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆయన.. డ్రైవర్లు సురక్షితంగా ఉన్నపుడే ప్రయాణికులను కరోనా నుంచి రక్షించుకోగలమని తెలిపారు. డ్రైవర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తే వ్యాక్సినేషన్ సులభం అవుతుందని, సాంకేతికతపై అవగాహన లేనివాళ్లకు సిబ్బంది సహకారంతో రిజిస్ట్రేషన్ చేయించి టీకా వేయిస్తున్నట్టు వెల్లడించారు.