63 లక్షల అభరణాలు చోరీ చేసిన వివాహిత
ఖమ్మం, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భర్తతో మనస్పర్థల కారణంగా ఓ వివాహిత ప్రియుడితో కలిసి సొంతింటికే కన్నంవేసింది. రూ.63 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను అపహరించింది. సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరుకు చెందిన శివప్రకాశ్ దారక్కు 2008లో గుంటూరుకే చెందిన అర్చనతో వివాహమైంది. శివప్రకాశ్ ఖమ్మం జిల్లా కారేపల్లిలో బంగారు ఆభరణాల తనఖా వ్యాపారం చేస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలతో కొన్నాళ్ల నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా గన్నవరానికి చెందిన బత్తుల వెంకటకృష్ణప్రసాద్తో అర్చనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గత నెలలో శివప్రకాశ్ తల్లి మరణించడంతో అర్చన కారేపల్లికి వచ్చింది. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసేందుకు పథకం రచించి.. ఈ నెల 3న ప్రియుడిని కారేపల్లికి రప్పించు కొంది. మరుసటి రోజు అర్ధరాత్రి ఇంట్లో లాకర్లోని బంగా రం, వెండి అభరణాలు, లాప్టాప్ను ప్రియుడికి అప్పగించింది. చోరీ జరిగినట్టు గుర్తించిన శివప్రకాశ్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాలు సేకరించిన పోలీ సులు నిందితులను అరెస్టుచేసి, సొత్తు స్వాధీనం చేసుకొన్నారు.