న్యూఢిల్లీ, మే 20: కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు ఆ వ్యక్తి నుంచి 10 మీటర్ల దాకా వ్యాపించవచ్చని కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి 10 మీటర్ల దూరం వరకు వైరస్ గాల్లోనే ఉండవచ్చని, అందుకే భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించాలని సూచించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకోండి. మహమ్మారిని అంతం చేయండి’ అనే పేరుతో గురువారం మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. వెంటిలేషన్ను ‘సామాజిక రక్షణవ్యవస్థ’గా అభివర్ణించింది. ఇండ్లల్లో, కార్యాలయాల్లో వైరస్ వ్యాప్తిని తగ్గించటానికి గాలి ధారాళంగా ప్రసరించే వెంటిలేషన్ వ్యవస్థ కచ్చితంగా ఉండాలని తెలిపింది. కిటికీలు, తలుపులు మూసి ఉన్న గదుల్లో వైరస్ అక్కడక్కడే గాలిలో తిరిగి ఎక్కువ మందికి వ్యాపిస్తుందని, వెంటిలేషన్ ఉంటే గాలి బయటకు వెళ్లి వైరస్ సోకే ముప్పు తగ్గుతుందని సూచించింది.
మార్గదర్శకాలు