సికింద్రాబాద్, మే 9: కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా ఇందు కు సహకరించి.. అన్ని జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం సోడియం హైపోక్లోరైట్ పిచికారీ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని.. వైరస్ బారినపడినవారికి ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఫీవర్ సర్వేను అన్ని కాలనీలు, బస్తీల్లో నిర్వహించేందుకు సికింద్రాబాద్ పరిధిలో 6ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశామని, ప్రజలకు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజ లు కొవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాప్తి నివారణకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ గీతాకుమారి, కార్పొరేటర్ హేమ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వినాయక్నగర్, మే 9 : కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డా. తిప్పర్తి యాదయ్య అన్నారు. ఆదివారం ఉదయం సర్కిల్ పరిధిలోని పలు ప్రాం తాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సంద ర్భంగా డీసీ మాట్లాడుతూ.. మాస్కులు పెట్టుకోని వారికి జరిమా నా విధిస్తున్నామని.. ఇక్కడ జరిమానా ముఖ్యం కాదని కరోనా వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యం గా.. ఈ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
కరో నా కట్టడికి గత నెలలో మచ్చ బొల్లారంలోని టెం పుల్ అల్వాల్లో రెండు ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాం తాలుగా ప్రకటించామని తెలిపారు. అయితే.. ప్రస్తు తం సర్కిల్ పరిధిలో కేసుల సంఖ్య పెరగకుండా ఆరో గ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ సర్వే చేస్తున్నారని.. ఇప్ప టి వరకు దాదాపు రెండు వేల ఇండ్లను సర్వే చేశారని తెలిపారు. అందులో సాధారణ లక్షణాలు ఉన్న 277 మందికి కిట్లను అందజేశామని, 36 మందిని పరీక్షల కోసం అల్వాల్లోని మండల ప్రాథమిక ఆరోగ్య కేం ద్రానికి పంపించామని డీసీ అన్నారు.