జనుము, జీలుగ సాగుతో రైతులు సహజ సిద్ధంగా భూసారాన్ని పెంచుకొని లబ్ధిపొందాలి. 25 నుంచి 30 శాతం మంది రైతులు వినియోగించుకుంటున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది సాగు చేయాలి. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తుంది. మేడ్చల్ డివిజన్ పరిధిలో మేడ్చల్, శామీర్పేట, మూడుచింతలపల్లి, కీసర, ఘట్కేసర్ మండలాల్లోని వ్యవసాయ సొసైటీల్లో రాయితీ జనము, జీలుగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. 65 శాతం రాయితీపై 30 కిలోల జీలుగ విత్తనాలు రూ.561.60, 40కిలోల జనములు విత్తనాలు రూ.929కే అందజేస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుతో గింజ గట్టిగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడుతుంది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో ఆరోగ్యకర ఉత్పత్తులను సాధించవచ్చు. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. -వెంకట్రాంరెడ్డి, ఏడీఏ, మేడ్చల్