కలెక్టర్ దాసరి హరిచందన
దామరగిద్ద మే 8 : మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు మద్దెలబీడ్ గ్రామంలో కలెక్టర్ హరిచందన ఆకస్మిక తనఖీ నిర్వహించారు. ముందుగా ప్రైమరీ హెల్త్ సెంటర్ను తనఖీ చేశారు. కిట్స్ కావాల్సినన్ని అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్కు సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. మెడికల్ కిట్లు ఎవరెవరికి ఇస్తున్నారు, వాటిలో మందులు ఏవి ఉన్నాయి.. తదితర వివరాలు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కరోనా లక్షణాలు ఎవకైనా ఉంటే వారికి హోం ఐసోలేషన్ కిట్స్ ఇచ్చి తగిన జాగ్రత్తలు సూచించాలన్నారు. కార్యక్రమంలో అదనపుల్ కలెక్టర్ చంద్రారెడ్డి, డీఎంహెచ్వో జయచంద్రమోహన్, డీపీవో మురళి పాల్గొన్నారు.