హైదరాబాద్: రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 13 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
కోర్సు పేరు: వెటర్నరీ సైన్స్లో పీహెచ్డీ
అర్హత: వెటర్నరీ సైన్స్లో పీజీ, తత్సమాన పరీక్షల్లో ఏదో ఒకదాంట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్ థీసిస్, వైవా వాయిస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరకఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రవేశపరీక్షకు 50 మార్కులు, ఎంవీఎస్ 20 మార్కులు, బీవీఎస్సీ 10 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో నిర్వహిస్తారు. కనీసం 50 శాతం మార్కులు సాధించాలి
దరఖాస్తు విధానం: ఆన్లైన్ (ఈ-మెయిల్)
అప్లికేషన్ ఫీజు: రూ.1400, ఎస్సీ ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు రూ. 700
దరఖాస్తు: ఈ మెయిల్ (pvnrtvuphd@gmail.com) ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2021
వెబ్ సైట్: http://tsvu.nic.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి