హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వవిద్యాలయం మే 10 నుండి వేసవి సెలవులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుదల నేపథ్యంలో మే10 నుంచి జూన్ 8 వరకు విద్యార్థులు, అధ్యాపకులకు వేసవి సెలవులను మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) శుక్రవారం ప్రకటించింది. విద్యార్థులు మరలా తమ ఇళ్ల నుండి సురక్షితంగా యూనివర్సిటీకి చేరుకోవాల్సిందిగా ఆకాంక్షిస్తూ వర్సిటీ ప్రకటనను విడుదల చేసింది. వీసీ నేతృత్వంలోని సమావేశంలో నిర్ణయించినట్లుగా జూన్ 9న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. జూలై 20 వరకు కొనసాగుతాయి. పరీక్షలు జూలై 21 నుండి నిర్వహించబడతాయి. తదుపరి సెమిస్టర్ కోసం తరగతులు ఆగస్టు 2 నుండి ప్రారంభమవుతాయని వర్సిటీ తెలిపింది.