ముంబై ,మే 6: సెన్సెక్స్ ఈరోజు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,668.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,725.05 వద్ద గరిష్టాన్ని, 14,611.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.59 0.50శాతం అంటే 86.60 పాయింట్లు ఎగిసి 14,705 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్ లిస్ట్ లో విప్రో 3.94 శాతం, హిండాల్కో 3.60 శాతం, హీరో మోటో కార్ప్ 3.51 శాతం, బజాజ్ ఆటో 2.55 శాతం, ఐచర్ మోటార్స్ 2.21 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్ 1.84 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.81 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.15 శాతం, సన్ ఫార్మా 1.11 శాతం, ఓఎన్జీసీ 0.86 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, సిప్లా, జేఎస్డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.