ముంబై ,మే 4: దేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అనుమతిస్తుండటంతో రిటైల్ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్ నివేదికలో పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్లైన్ చెల్లింపులు విస్తరిస్తున్నాయని నాబార్డ్ వివరించింది. లాక్డౌన్ సమయంలోనూ ఆన్లైన్ చెల్లింపులు బాగా పెరిగాయని తేలింది.
నాబార్డ్ అందించిన నివేదిక ప్రకారం.. 2019 డిసెంబర్లో జరిగిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే 2020 అక్టోబర్లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి. ఇండియాలో డిజిటల్ పేమెంట్లుపెరుగుతున్నాయి.ఈ క్రమంలోనే పలురకాల మోసాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆన్లైన్ ఆర్థిక కార్యకలాపాలనుప్రోత్సహిస్తూనేఉన్నది. అయితే పాత నోట్ల రద్దు సమయంలో జరిగిన ఆన్లైన్ పేమెంట్స్తో పోలిస్తే.. కరోనా సమయంలోనే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా పెరిగినట్లు తాజా గణంకాలు చెబుతున్నాయి. అంతేకాదు డిజిటల్ పేమెంట్స్తో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా భారీగా పెరిగాయి.