షాద్నగర్టౌన్, మే 2 : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఇందులో భాగంగానే కామ్సన్ హెల్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ కార్మికులకు శానిటైజర్లను అందజేసి మాట్లాడారు. మున్సిపాలిటీలో కరోనా కేసులు పెరుతున్నాయనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మాస్క్ లేకుండా ఎవరూ బయట తిరగొద్దని, మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామన్నారు. మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. శానిటైజర్లను అందజేసిన కామ్సన్ మేనేజింగ్ మనీష్కుమార్ను శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ముకేశ్, హెచ్ఆర్ నర్సింగ్, సభ్యులు రియాజ్, నర్సిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని రైల్వేస్టేషన్ నుంచి పట్టణ ముఖ్యకూడలి వరకు ప్రధాన దారిలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించారు.
కొవిడ్పై ప్రజలకు అవగాహన కల్పించాలి
గ్రామాల్లో కొవిడ్-19 ప్రభలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీవో హరీశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ..కొవిడ్ 19 ప్రభలకుండా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. ప్రజలు గుంపులుగా ఉండకుండా శానిటైజేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఉపాధిహామీ పనులు కొనసాగించాలన్నారు.
పరిసరాల శుభ్రత తప్పని సరి
ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మండలంలోని విశ్వనాథ్పూర్ సర్పంచ్ శ్రీధర్రెడ్డి అన్నారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో మురుగు కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే కరోనాను పారదోలవచ్చని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజనర్సింహులు పాల్గొన్నారు.