జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెలలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.600 కోట్లు సేకరించాలన్న లక్ష్యం నెరవేరడం కష్టసాధ్యంగా మారింది. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే, మరో వారం రోజులు మాత్రమే ఈ ఎర్లీబర్డ్ పథకం ఆమలులో ఉండటం, ఇప్పటి వరకు రూ.600 కోట్ల టార్గెట్లో రూ.110.43 కోట్లు మాత్రమే వసూలైంది. ఆస్తి పన్ను చెల్లించే వ్యక్తులు, సంస్థలు, కార్యాలయాలు కరోనా కోరల్లో చిక్కుకోవడంతో, ఆన్లైన్లో చెల్లించే అవకాశం ఉన్నా కరోనాతో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపులకు దూరంగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు.