నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 22: ఎలాగైనా సరే కరోనాను ఖతం చేయాలి.. మనుషుల ప్రాణాలను కాపాడుకోవాలి..! ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరి మెదళ్లలో ఇదే ఆలోచన. ఒకరు వ్యాక్సిన్, ఇంకొకరు ట్యాబ్లెట్, మరొకరు చుక్కల మందు.. ఇలా పరిశోధనలు చేస్తూ బిజీగా ఉన్నారు. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) కూడా తనవంతుగా యాంటీ బాడీ థెరపీ ప్రయోగాలు చేస్తున్నది. ఇందులోభాగంగా గుర్రాలపై చేసిన యాంటీ బాడీ థెరపీ విజయవంతమైంది. దీంతో మనుషులపైనా ప్రయోగాలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్టు సమాచారం. సీసీఎంబీ, విన్స్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ కలిసి కొన్ని నెలలుగా గుర్రాలపై ప్రయోగాలు చేశాయి. ఇన్యాక్టివ్ కరోనా వైరస్ను గుర్రాల రక్తంలోకి పంపించి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఇందుకు దాదాపు 300 గుర్రాలను ఉపయోగించినట్టు తెలిసింది. ఇన్యాక్టివ్ వైరస్ ద్వారా యాంటీబాడీలు వృద్ధి జరిగేలా చేశారు. ఆ గుర్రాల రక్త నమూనాలను సేకరించి పూర్తిగా శుద్ధిచేసి ఇతర గుర్రాలపై ప్రయోగించారు. ఎలుకలు, కుందేళ్లపై కూడా ప్రయోగించినట్టు తెలిసింది. ఈ ప్రయోగం ద్వారా గుర్రాల శరీరంలో కరోనా ప్రతిరక్షకాలు ఏర్పడి సత్ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు వివరించారు.
ఇవీ కూడా చదవండి…
అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి