న్యూఢిల్లీ: కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యం వీడాలని టీమ్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించారు. స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం భారత్లో కరోనా రెండో వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ముంబై, ఢిల్లీవంటి మెట్రో నగరాల్లో పరిస్థితి ఘోరంగా మారింది. దేశవ్యాప్తంగా నిత్యం వేల కేసులు నమోదు అవుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారంతపు లాక్డౌన్ పాటిస్తున్నాయి.
‘మిత్రులారా! రోజురోజుకూ కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో మీకందరికీ తెలిసిందే. ఇంతకుముందే చెప్పా. మళ్లీ చెప్తున్నా.. నిత్యవసర సరుకుల కోసం గానీ, ముఖ్యమైన పనుల మీద బయటకెళితే తప్పకుండా మాస్కులు ధరించండి. ఎల్లప్పుడూ శానిటైజర్లు వాడండి’ అని సూచించారు.
‘ఇతరులతో భౌతిక దూరం పాటించండి. వైరస్ను నివారించాలంటే ఈ జాగ్రత్తలన్నీ ఎంతో ముఖ్యం. ఇందుకోసం పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. మీరు కూడా వారికి సహకరించి జాగ్రత్తగా ఉండండి. మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. జై హింద్’ అని కోహ్లీ వీడియోలో చెప్పారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు