నంగునూరు/జగదేవ్పూర్/దుబ్బాక/హుస్నాబాద్టౌన్, ఏప్రిల్ 20 : కరోనాతో జాగ్రత్తతో ఉంటూ కర్ఫ్యూకు సహకరించాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితవెంకన్న కోరారు. పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు ఆర్టీసీ బస్టాండ్ తదితర కూడళ్లలో మంగళవారం హైప్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కర్ఫ్యూకు అందరూ సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, కౌన్సిలర్లు బూక్యా సరోజన, కోమటి స్వర్ణలత, కో-అఫ్షన్ సభ్యు లు అయిలేని శంకర్రెడ్డి, ఎండీ. అయూబ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రవికుమార్ ఉన్నారు.
దుబ్బాకలో..
కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణతో పాటు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని దుబ్బాక ఎంపీడీవో భాస్కరా చారి సూచించారు. మంగళవారం దుబ్బాక మం డలం గంభీర్పూర్లో రామక్కపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించారు. సూమారు 700 మందికి వ్యాక్సిన్ వేశారు. ప్రజలు కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరికే భాస్కర్, నాయకులు కొత్త కిషన్రెడ్డి , పీహెచ్సీ వైద్య సిబ్బంది ఉన్నారు.
టీకాతోనే నియంత్రణ
ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని ఎంపీపీ బాలేశంగౌడ్ అన్నారు. చాట్లపల్లిలో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా క్యాంపును మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.ప్రజలంతా సహకరించాలి
కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని రాజగోపాల్పేట ఎస్సై మహిపాల్రెడ్డి కోరారు. మంగళవారం ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రోజు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మండలంలో కర్ఫ్యూ ఉంటుందన్నారు.