లక్నో : లోదుస్తుల్లో రూ కోటి విలువైన బంగారం దాచి దేశంలోకి తరలిస్తున్న యువతి (22)ని లక్నోలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. యువతి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన విద్యార్ధిని దుబాయ్ నుంచి మంగళవారం ఇండిగో విమానంలో లక్నో చేరుకుంది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆమెను తనిఖీ చేయగా రూ కోటి విలువైన 2318 గ్రాముల బంగారాన్ని అండర్ వేర్ లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు.
దీంతో బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు విద్యార్ధినిని అరెస్ట్ చేశారు. తెలుపు రంగు పాలిథీన్ కవర్ ను లోదుస్తుల్లో దాచి బంగారాన్ని తరలిస్తూ మహిళా ప్రయాణీకురాలు పట్టుబడ్డారని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ నిహారిక లఖా వెల్లడించారు. కాగా, యూపీ రాజధానిలో భారీగా బంగారం తరలిస్తూ విద్యార్ధిని పట్టుబడటం ఇదే తొలిసారి. ఇక అరెస్ట్ అయిన విద్యార్థిని నుంచి గోల్డ్ కన్సైన్మెంట్ పొందేందుకు విమానాశ్రయం ఎదుట గుర్తుతెలియని వ్యక్తి వేచిచూస్తున్నట్టు వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు.