యంగ్ హీరో శర్వానంద్ మార్చి 19న శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియా అరుళ్ మోహన్, సాయికుమార్, మురళీశర్మ, రావు రమేశ్, నరేశ్, ఆమని, సప్తగిరి, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా ఈ చిత్రాన్ని కిషోర్ తెరకెక్కించారు. సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం చేయాలో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.
శ్రీకారం చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ చిత్రాన్ని సన్నెక్స్ట్ యాప్లో ఏప్రిల్ 16 నుంచి ప్రసారం చేయనున్నారు. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడొచ్చు.తినేవాళ్లు నెత్తిమీద జుట్టంత సంఖ్యలో ఉంటే.. పండించే వాళ్లు మూతిమీద మీసం అంత కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో వ్యవసాయదారుల జీవితాలు ఎలా మారిపోయాయి అన్నది సినిమాలో చక్కగా చూపించారు. ఇదిలా ఉంటే రీసెంట్గా విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో ప్రసారం అవుతుండగా.. ఆహా, క్రాక్, నాంది ఆహాలో ప్రసారం అవుతున్నాయి. తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు కూడా ఈ నెల 16, 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.