ఉచిత విద్యుత్ ప్రకటనతో రజకులు, నాయీబ్రాహ్మణుల హర్షం
పటాకులు కాల్చి.. స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 6: లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచి త విద్యుత్ అందిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి అంటూ రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణ రజక సంఘం, లాండ్రీ అసోసియేషన్ నేత ల ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో పటాకులు కాల్చి, సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రజకుల సంక్షేమానికి సీఎం ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్తో జిల్లాలోని 2,350లాండ్రీ దుకాణాలపై ఆధారపడిన కుటుంబాలకు ఆసరా ఏర్పడుతుందన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్లలో రజకులకు ఆధునిక వసతులతో చేపట్టిన ధోబీఘాట్ నిర్మాణం తుది దశకు చేరుకున్నదని తెలిపారు. కాసర్ల దేవయ్య, వేములవాడ బాలయ్య, దండు శ్రీనివాస్, బండి మల్లేశం, శ్రీనివాస్, దండు భాస్కర్ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 6: సీఎం కేసీఆర్ కష్టం తెలిసిన కరుణామయుడని నాయీబ్రాహ్మణ సంఘం ఉమ్మడి మం డలాధ్యక్షుడు నీలం రాజేశ్ కొనియాడారు.
సెలూన్లకు ఉచి త విద్యుత్ సరఫరా ప్రకటనను స్వాగతిస్తూ మండల కేం ద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి అంకం రాము, అంకం వేణు, గొరిటిపల్లి శ్రీనివాస్, మారుతి, చెట్టిపల్లి నారాయణ, అవధూత నారాయణ, అవధూత శ్రీనివాస్, చెట్టిపల్లి కుమార్, కంది బల్ రాం, వడ్నాల శ్రీనివాస్, మద్దికుంట సత్తయ్య, కోత్వాల అశోక్ తదితరులు ఉన్నారు.ఇల్లంతకుంట, ఏప్రిల్ 6: మండల కేంద్రంలోని బస్టాం డ్ ఆవరణలో నాయీబ్రాహ్మణులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కే నర్సయ్య, మల్లెంకి శ్రీనివాస్, వెంకటేశ్, శ్రీనివాస్, తిరుపతి, దేవయ్య, జనార్దన్, భాస్కర్, బాలయ్య, పరశురాం, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.