మహబూబ్ నగర్ : జిల్లాలోని గండీడ్ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సి. గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంగళవారం గ్రామానికి చేరుకుని గోపాల్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసానిచ్చారు. గోపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.