న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్నది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మార్చి 15, 16 తేదీల్లో సమ్మె చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇటీవల పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు ఇవాళ దేశ్యాప్తంగా బ్యాంకులను మూసేసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సమ్మెకు మద్దతుగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి సమ్మెకు దిగారు. ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ యోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో, త్రిపుర రాజధాని అగర్తలాలో, బీహార్ రాజధాని పట్నాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.