అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళికి అత్యున్నత గౌరవం ఇవ్వాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75వ ఏండ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న వేళ పింగళికి భారతరత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. పింగళికి భారతరత్న ఇచ్చేలా కృషి చేయాలని పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కలిసి కోరారు.