పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి
ప్రతి రైతుకూ సాగునీరందించాలి
అధికారులతో సమీక్షలో మంత్రి సత్యవతిరాథోడ్
మహబూబాబాద్,జూలై12 : జిల్లాలోని రైతులందరికీ సాగునీరు అందేలా చూడాలని, అందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి సత్యవతిరాథోడ్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సోమవారం ఆమె కలెక్టరేట్లో కలెక్టర్ గౌతమ్తో కలిసి సాగునీటి ప్రణాళికపై నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది అదనపు ఆయకట్టుకు సైతం నీరందించాలన్నారు. జిల్లా 737 చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 180 చెరువులు, డోర్నకల్ నియోజకవర్గంలో 180, తొర్రూరులో 37 చెరువుల ను ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నింపే అవకాశం ఉందన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కాల్వలు, యూ టీలు, గొలుసు కట్టు ద్వారా అవకాశమున్న ప్రతి చెరువును నింపి రైతులకు సాగునీటికి లోటు లేకుండా చూ డాలన్నారు. రెండో పంటకు కూడా సాగునీరు అందేవిధంగా చెరువులను పుల్ ట్యాంక్ లెవల్తో ఉంచాలన్నారు. పెండింగ్లో ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతులు పనులను వేగవంతం చేయాలన్నారు.
జాతీయ రహదారుల మ్యాప్ల పరిశీలన
అనంతరం కలెక్టరేట్లో మంత్రి సత్యవతిరాథోడ్ జాతీయ రహదారుల రూట్ మ్యాప్లను పరిశీలించారు. ఖమ్మం నుంచి కురవి వరకు, సూర్యాపేట జిల్లా నుంచి మహబూబాబాద్ మీదుగా వెళ్లే జాతీయ రహదారులతోపాటు హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం, నాగపూర్ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారుల రూట్ మ్యాప్లను అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అలాగే హైదరాబాద్ ఔటర్రింగ్ రోడ్ నుంచి జిల్లా మీదుగా కొత్తగూడెం వరకు, పాగపూర్ నుంచి జిల్లా మీదుగా విజయవాడ వరకు నిర్మించను న్న రహదారుల మ్యాప్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. రూట్ మ్యాప్లలో కొన్ని మార్పులు, చేర్పు లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ స మావేశంలో అదనపు కలెక్టర్ కొమురయ్య, జాతీ య రహదారుల ఇంజినీర్లు పాల్గొన్నారు.