ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలి
ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలి
నాలుగో విడుత జ్వర సర్వే ప్రారంభించాలి
వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ
డోర్నకల్, జూలై 12: కొవిడ్ నియంత్రణకు చర్యలు చేప ట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ ఆదేశించారు. సోమవారం డోర్నకల్ మండల కేంద్రంలోని రైల్వే ఫంక్షన్ హాల్లో వైద్యాధికారులతో సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొవిడ్ ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని అన్నారు. రోజు కు 150 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో బయటికి వెళ్లి వచ్చే వారితో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. పాజిటివ్ వచ్చిన వారి నుంచి వివరాలు సేకరించి ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులను గుర్తించాలన్నారు. గ్రామాల్లో నాలుగో విడుత జ్వర సర్వే ప్రారంభించాలని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్య క్తుల వివరాలు కొవిడ్ యాప్లో నమోదు చేయాలని కోరా రు. జిల్లాకు ఇచ్చిన 300 ఆర్టీపీసీఆర్ టెస్టులు పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా వారీగా కొవిడ్ వ్యాక్సినేషన్ శాతం పెంచాలని, గిరిజన ప్రాంతాల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. నెజిల్లా, మండల వైద్యాధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ట్రెయినీ కలెక్ట ర్ అభిషేక్ అగస్త్య, డీఎంవీ రమేశ్రెడ్డి, డీహెచ్డీ శ్రీనివాసరా వు, టీఎస్ఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్, సీఎం కార్యా లయ కార్యదర్శి గంగాధర్, ఆర్డీవో కొమురయ్య, జిల్లా వైద్యా ధికారి హరీశ్రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో అంబరీశ్, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో పీడీ సన్యాసయ్య, నోడల్ అధికారి రాజేశ్ పాల్గొన్నారు.
నేడు వరంగల్కు రిజ్వీ..
వరంగల్ చౌరస్తా: ఎంజీఎం దవాఖానలో రోగులకు, కరోనా బాధితులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్ష నిర్వహించడానికి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ వరంగ ల్కు రానున్నారు. ప్రస్తుతం ఓపీ సేవలకే పరిమితమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నూతనంగా నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ స్థలాన్ని ఆయన సందర్శించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.