మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. నిత్యం శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే పోలీసులు ఖాళీ సమయంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. మొదటి, రెండు, మూడో విడుత హరితహారంలో భాగంగా పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు అప్పటి ఎస్సైలు ప్రత్యేకంగా వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్సై నరేశ్ కూడా అదేస్ఫూర్తితో కొనసాగిస్తున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 2018లో విద్యార్థులు, ఉద్యోగులు నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దవయ్యాయి. పాఠశాల దారికి ఇరువైపులా మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పని చేసిన యాకూబ్జానీ కార్యాలయంలో ఎక్కడ చూసినా బండరాళ్లు ఉండడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎర్రమట్టి పోయించి మొక్కలు నాటించారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగాయి.
నిత్యం పర్యవేక్షిస్తున్నాం
తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని మొక్కల సంరక్షణను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. గతంలో పనిచేసిన యాకూబ్జానీ నాటించిన మొక్కలు పెరిగి కార్యాలయానికి వచ్చే ప్రజలకు నీడనిస్తున్నాయి. వేసవిలో కూడా కార్యాలయం పచ్చనిచెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్లు, మొక్కల మొదళ్లలో కలుపు లేకుండా, పిచ్చి మొక్కలు పెరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.