చిన్నగూడూరు, జూలై 29: నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో సరస్వతి సూచించారు. గురువారం మండలంలోని పగిడిపల్లి గ్రామంలో నాటిన మొక్కలను, డంపింగ్ యార్డును పరిశీలించారు. పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రోజా, సిబ్బంది తదితరులు ఉన్నారు.దంతాలపల్లి, జూలై 29: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్ఐ మురళీధర్రాజు సూచించారు. హరితహారంలో భాగంగా మండలంలోని కుమ్మరికుంట్లలో గురువారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దు బ్బాకుల వెంకన్న, ఏఎస్ఐ విజయరాజు, పంచాయతీ కార్యదర్శి సృజన, ఉపసర్పంచ్ చామకురి సత్తెమ్మ, వార్డు సభ్యులు వీరస్వామి, వెంకన్న, పోలీస్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ బోడ లక్ష్మణ్ నాయక్ సూచించారు. గురువారం పంచాయతీ శివారులో వార్డ్మెంబర్లతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరిత హా రంలో భాగస్వాములవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, రవి కుమార్, రాంబా బు, పంచాయతీ కార్యదర్శి వీరన్న పాల్గొన్నారు.