కుమ్రం భీమ్ అసిఫాబాద్ : జిల్లాలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంప్రదాయ బాజా భజంత్రీలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసుల ఆరాధ్య దైవంగా కొలిచే ఆదివాసీ వీరుడు కుమ్రం భీమ్ విగ్రహానికి జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అడవి బిడ్డల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.
ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సమిష్టి జీవన పద్ధతులు, పరస్పర సహకారం, నిష్కలమైన జీవితాలకు సాక్ష్యాలు ఆదివాసులు అన్నారు. కార్యక్రమంలో అసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, వైస్ చైర్మన్ గాదవెని మల్లేష్, అసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ, ఆదివాసీ నాయకులు పెందూర్ సుధాకర్, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్