ఉట్నూర్ సీఐ నరేశ్కుమార్
వాహనాలు సీజ్, జరిమానా
ఉట్నూర్, మే 22: అత్యవసరమైతేనే బయటకు రావాలని వాహనదారులకు సీఐ నరేశ్ కుమార్ సూచించారు. పట్టణంలోని జగ్జీవన్రాం చౌరస్తాలో వాహనాలు ఆపి జరిమానా విధించారు. అలాగే అకారణంగా తిరిగే వారి వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో శిక్షణ ఎస్ఐ రాజమణి, సిబ్బంది పాల్గొన్నారు.
వాహనాల తనిఖీ
బోథ్, మే 22: బోథ్, పొచ్చెర క్రాస్రోడ్డు సమీపంలో సీఐ నైలు, ఎస్ఐ రాజు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమర్థవంతంగా అమలవుతోందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి అవసరం లేకున్నా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పనుల మీద ఈ పాస్లతో వెళ్తున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
50 వాహనాలు సీజ్
ఇంద్రవెల్లి, మే 22: కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించి బయట తిరుగుతున్న వాహనదారులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ నాగ్నాథ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎస్ఐ నాగ్నాథ్ పోలీసు బలగాలతో పర్యటించారు. దుకాణాలు మూసి వేయించారు. 10 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చిన 50 వాహనాలు సీజ్, 31 వాహనాలకు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. అనంతరం అంబేద్కర్ చౌక్ సమీపంలో రోడ్డుపై కరోనా మహమ్మారి బొమ్మను గీయించారు. ఆయన వెంట ఏఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది మోహన్, గణేశ్, కర్తార్ ఉన్నారు.
బేల, మే 22: మండల కేంద్రంలో ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చిన వాహనాలను ఎస్ఐ సాయన్న సీజ్ చేశారు. పోలీసులు పాల్గొన్నారు.
తాంసి, మే 22: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎస్ఐ శీరిష ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేశారు.
పది తర్వాత బయటకు రావొద్దు
బజార్హత్నూర్, మే 22: పది గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ ఉదయ్కుమార్ అన్నారు. మండల కేంద్రంతో పాటు జాతర్ల, దేగామ, భూతాయి, గిర్నూర్ గ్రామాల్లో లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పోలీసులతో గస్తీ
నేరడిగొండ, మే 22 : మండల కేంద్రంలో ఎస్ఐ భరత్సుమన్ పోలీసులతో కలిసి గస్తీ నిర్వహించారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.