ఆదిలాబాద్ రూరల్, మే 8: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మావల జడ్పీటీసీ వనిత పేర్కొన్నారు. మావలలో శనివారంముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రంజాన్ సందర్భంగా 3లక్షల పేద కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. మైనార్టీల్లో విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా గురుకులాలను ప్రారంభించారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, నాయకులు రాజేశ్వర్, అజీమ్, ఆసిఫ్ పాల్గొన్నారు.
ఉట్నూర్, మే 8: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో వైస్ ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్ సభ్యుడు రషీద్ ముస్లింలకు రంజాన్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రంజాన్ పండుగకు ముస్లింలకు దుస్తులు అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింగారే భరత్, యూత్ నాయకులు అన్సారి పాల్గొన్నారు.