గాదిగూడ ఎంపీపీ ఆడ చంద్రకళారాజు
నార్నూర్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని గాదిగూడ ఎంపీపీ ఆడ చంద్రకళారాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు.మొక్కల అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వాటిని సంరక్షిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిం చారు. సర్పంచ్ మెస్రం జైవంత్రావ్, సెంట్రల్ ఫర్ పీపుల్ సాంకేతిక అధికారి రాథోడ్ దిలీప్, కోట్నాక్ లింబారావ్, జుగ్నాక్ గాగ్రు, లక్ష్మి ఉన్నారు.
ఉట్నూర్, జూన్ 5: మండలంలోని సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులు గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ రాజేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో పండ్ల మొక్క లు నాటేలా తమ సంస్థ అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, అంగన్వా డీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 5: హరిత తెలంగాణ కోసం ప్ర తి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ పంద్ర జైవంత్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో తిరుమలతో కలిసి శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అడవులపైనే మానవ మనుగడ ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఏపీవో రజినీకాంత్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దాసండ్ల ప్రభాకర్, టీఏ వేణు, పంచాయతీ కార్యదర్శి జగదీశ్, సిబ్బంది పాల్గొన్నారు.
బీర్సాయిపేట్ జీపీలో..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీర్సాయిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని భూపేట్ గ్రామంలో సీపీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. అ నంతరం అంగన్వాడీ కేంద్రానికి కూరగాయల విత్తనాలు అం దించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకవ్వ, సీపీఎఫ్ సిబ్బంది రాజేందర్, ఈశ్వర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 5: ప్రకృతి ప్రసాదించిన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముక్రా (బీ) ఎంపీటీసీ గాడ్గె సుభాష్ అన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతో ష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భా గంగా ముక్రా (కే) గ్రామంలో యాభై మొక్కలను నాటి, నీ రు పోశారు. వచ్చే నెలలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 21వేల మొక్కలు నాటి, వంద శాతం మొక్కలను సంరక్షించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి పాల్గొన్నారు.