మంచిర్యాల పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలతో పాటు రాళ్లవాగు, రాంచెరువు, పోచమ్మ చెరువు, సాయికుంట, గోదావరి నది వద్ద నిమజ్జన ప్రదేశాలను, గోదావరి తీర ప్రాంతంలో దసరా రోజున నిర్వహించే జమ్మిపూజకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని బ్రహ్మంగారి ఆ లయం సమీపంలోని రాళ్లవాగు వద్ద బతుకమ్మ ఆడే ప్రాంతాన్ని మరింత చదును చేయాలని సూచించారు. రాళ్లవాగు కాజ్వే వద్ద, రామునిచెరువుకు హైటెక్కాలనీ వైపు, జన్మభూమి నగర్వైపు, సాయికుంట చెరువులను పరిశీలించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాలతో పాటు నిమజ్జన ప్రాంతాలవద్ద లైటింగ్, పారిశుధ్య పనులు, తాగునీటి వసతి , మైదానాలను చదును చేయడం వంటి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏఈ నర్సింహస్వామి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, ప్రధాన కార్యదర్శి గడప రాకేశ్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు గరిగంటి సరోజ, నాయకులు గొంగళ్ల శంకర్, జగన్మోహన్రావు, సింగతి మురళి, వోలం రాజ్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీలోని ఇందిరమ్మకాలనీ, చెరువు కట్ట, సింగాపూర్ పునరావాసకాలనీ వద్ద గల వాగు, సీతారాంపల్లి రోడ్డు, ఎస్ఆర్పీ-3 రైల్వే ట్రాక్ పక్కన గల బతుకమ్మల నిమజ్జన ఘాట్లను ఎమ్మెల్యే దివాకర్రావు పరిశీలించారు. మున్సిపల్, సింగరేణి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ రాజలింగు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కౌన్సిలర్ వంగ తిరుపతి, కో ఆప్షన్ సభ్యులు ముత్తె రాజేశం, నాయకులు మెరుగు పవన్కుమార్, గర్శె భీమయ్య, రౌతు రజిత, గర్శె రామస్వామి, కమలాకర్రావు, అన్నయ్య, చెల్ల విక్రమ్, జక్కుల రాజేశం, మోతె కనుకయ్య, జక్కుల కుమార్, తోట దుర్గాప్రసాద్, గట్టు శ్రీనివాస్, పంబాల ఎర్రయ్య, నౌండ్ల సంతోష్చారి, కాటం రాజు, రవిగౌడ్ తదితరులున్నారు.