సంబురాలు చేసుకున్న ఉద్యోగులు
ఎదులాపురం, జూన్ 12 : స్వరాష్ట్రం సాధించుకు న్న తరుణంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర కు సమస్యలు పరిష్కరిస్తూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పాలన కొనసాగుతున్నదని ఆదిలాబాద్ టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు సంద అశోక్, నవీన్ కుమా ర్ అన్నారు. పిట్మెంట్తో పాటు పీఆర్సీ జీవోను విడుదల చేయడంపై టీఎన్జీవో నాయకులు శనివారం సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలను దశలవారీగా పరిష్కరించారని పేర్కొన్నారు. ఇం దులో భాగంగానే 30 శాతం ఫిట్మెంట్తో పీ ఆర్సీ జీవోలను విడుదల చేయడం, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడం హర్షణీయమన్నారు.
పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ముంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, రాష్ట్రంలో పనిచేస్తున్న 9.5 లక్షల ఉద్యోగలందరికీ మేలు జరిగేలా జీవోలు విడుదల చేశార ని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఉద్యోగుల తరఫున సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, ఉన్నత అధికారులు, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రయకంటి ప్రతాప్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల మోహన్, రాజేశ్వర్, అసూరి ప్రవీణ్, ఓంప్రసాద్, మేదరి నవీన్, అజయ్ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్, దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.