కార్మికుడి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు పోలీసలు
ఆసిఫాబాద్(వాంకిడి), ఏప్రిల్ 1: వాంకిడి మండలకేంద్రంలోని పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ,పోలీసులు తెలిపిన ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షకు చెందిన టేకం సూరజ్ (25), సాకేత్ అనే ఇద్దరు వాండికి మండల కేంద్రంలోని జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చిక్లివాగు (పురాతన) బ్రిడ్జి వద్ద ఎయిర్టెల్ కేబుల్స్ను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వంతెన ఒక్కసారిగా కుప్పకూలగా సూరజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. బంటిని స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీసి వెంటనే ఆసిఫాబాద్ సర్కారు దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది లాఉంటే వంతెన కుప్పకూలిన విషయ న్ని గమనించిన కానిస్టేబుల్ శేషారావు వెంటనే అక్కడికి చేరుకొని శిథిలాల కింద ఉన్న క్షతగాత్రుడిని బయటకు తీ సి ప్రాణాలు కాపాడాడు. వెంటనే వాంకిడి ఎస్ఐ రమేశ్కు సమాచారం అందించడంతో అక్క డి చేరుకున్న ఆయన శిథిలాల కింద చిక్కుకున్న మరొకరిని బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. ప్రాణాలు కాపాడిన శేషారావును ఏఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, వాంకిడి సీఐ సుధాకర్, గ్రామస్తులు ఆయన్ను అభినందించారు.