ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పన రూ.12 వేల జరిమానా
మాస్కులు ధరించని 12 మందిపై కేసులు
మంచిర్యాల టౌన్ (శ్రీరాంపూర్), ఏప్రిల్ 1 : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద గురువారం రాత్రి మాస్కులు ధరించని 12 మందిపై ఎస్ఐ మంగీలాల్ కేసు నమోదు చేశారు. ఒక్కొక్కరికీ రూ. 1000 చొప్పున రూ.12 వేల జరిమానా వి ధించారు. ఈ డబ్బులను కోర్టులో కట్టాలని సూచించారు. గురు వా రం కరోనా నివారణపై నిర్వహించిన సదస్సులో సీఐ కోటేశ్వర్రావు మాట్లాడుతూ మాస్కులు ధరించని వారిని పట్టుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద 188 సెక్షన్ నమోదు చేసి జరిమానా విధి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సత్య నారాయణ, నాయక్, రవి పాల్గొన్నారు.