గర్మిళ్ల, మే 30 : ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ను జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బందితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి కూడా టీకాలు వేయాలన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి 140 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. టీకా అందిస్తున్న సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని, బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి డాక్టర్ ఫయాజ్, ఆర్టీసీ డీఎం మల్లేశయ్య, తదితరులు పాల్గొన్నారు.
పాత్రికేయులు టీకా తీసుకోవాలి..
హాజీపూర్, మే 30 : జిల్లాలో అక్రిడిటేషన్ గల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఆయా పత్రికలు, చానళ్ల సంస్థ పరిధిలో పని చేస్తున్న పాత్రికేయులు సైతం వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదివార ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31న కూడా జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి అక్రిడేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలని, అక్రిడిడేషన్ లేని వారు సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకొని టీకా వేసుకోవాలని ఆమె సూచించారు.
71 మందికి వ్యాక్సిన్..
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, మే 30 : జిల్లా కేంద్రంలోని డిపో ప్రాంగణంలో 71 మంది సిబ్బంది టీకా వేసుకున్నట్లు ఆసిఫాబాద్ డీఎం కృష్ణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కుమ్రం బాలు, అసిస్టెంట్ మెనేజర్ దేవపాల, ఎంఎఫ్ సుదాకర్, వైద్య సిబ్బంది, సిబ్బంది ఉన్నారు.