ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్/ రెబ్బెన, మే 29 : రైస్ మిల్లర్ల ఆగడాలు అరికట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిర్యాణి, రెబ్బెన మండలాల్లోని కొ నుగోలు కేంద్రాల్లోని ధాన్యం విషయంలో మిల్లర్లు తిరాకాసులు పెడుతూ కోతలు పెడుతున్నారన్నారు. లాక్డౌన్ సమయంలో లారీల కొరత తీవ్రంగా ఉందన్నారు. అదేవిధంగా రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చూడాలని కోరారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు బోర్వెల్స్ మంజూ రు చేయాలని విన్నవించానన్నారు. కలెక్టర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారని ఆయన తెలిపారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్ రావు, ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీఎస్ డైరెక్టర్ చంచు శ్రీనివాస్, రెబ్బెన పీఎ సీఎస్ చైర్మన్ సంజీవ్, వైస్ చైర్మన్ రంగు మహేశ్, సిర్పూర్ పీఎసీఎస్ చైర్మన్ శివాజీ, సిర్పూర్ వైస్ ఎం పీపీ ఆ త్రం ప్రకాశ్, నేట్నూర్ సర్పంచ్ అర్క నాగోరావు పాల్గొన్నారు.