ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
సిర్పూర్(టి) సామాజిక దవఖాన, కాగజ్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన
సిర్పూర్(టి), మే 28 : సూపర్ స్ప్రెడర్లకు రెండ్రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాహూల్ రాజ్ అధికారులకు సూచించారు. మండలకేంద్రంలోని సిర్పూర్(టి) సామాజిక దవాఖానను శుక్రవారం ఆయన సందర్శించి వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలకుండా పాత్రికేయులు, రేషన్ డీలర్లు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, హమాలీలు, విత్తనాలు, పురుగు మందులు అమ్మేవారిని ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిందన్నారు. వా రందరూ తప్పకుండా టీకా వేసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో చిత్రు, తహసీల్దార్ నదీముల్లా ఖాన్, డీటీ వామన్రావు, ఎంపీడీవో రాజేశ్వర్, వైద్యు లు చెన్నకేశవ, నవత, ఎస్ఐ రవి కుమార్, వీఆర్వోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పీహెచ్సీ తనిఖీ
కాగజ్నగర్టౌన్, మే 28: పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్ప్రెడర్లు తమ పేర్లను నమోదు చేసుకొని టీకా వేసుకోవాలన్నారు. దవాఖాన ఆవరణలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్, టెస్టుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందికి సూ చించారు. ఆయన వెంట కాగజ్నగర్ ఆర్డీవో చిత్రు, తహసీల్దార్ ప్రమోద్కుమార్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో సునీల్రావు, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.
వ్యాక్సిన్తోనే వైరస్ నియంత్రణ :
కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, మే 28 : వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని సర్కారు దవాఖానలో సూపర్ స్ప్రెడర్లకు వేస్తున్న వ్యాక్సినేషన్ను డీఎంహెచ్వో సుబ్బారాయుడు, వైద్యాధికారి ఫయాజ్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దివాకర్రావు పరిశీలన..
మంచిర్యాల ఏసీసీ, మే 28: మంచిర్యాల సర్కారు దవాఖానలో సూపర్ స్ప్రెడర్లకు టీకా ప్రారంభించడంతో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరిశీలించారు. టీకా వేసుకునేవారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు పట్టణ టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, నాయకులు ఉన్నారు.
పీహెచ్సీ తనిఖీ..
రెబ్బెన, మే 28 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని అదనపు కలెక్టర్ రాజేశం శుక్రవారం సందర్శించారు. వ్యాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులందరికీ టీకా వేయాలని సూచించారు. దవాఖానను నిత్యం శుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రియాజ్అలీ, డిప్యూటీ తహసీల్దార్ పిట్టల సరిత, వైద్యాధికారి భరత్, పలువురు ఉన్నారు.