ఆసిఫాబాద్, జూలై 26 : ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డు పత్రాలను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రా ష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ రేషన్కార్డుల ద్వారా నెలనెలా బియ్యం, తదితర వస్తువులు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ సాంకేతిక సమస్య వల్ల రేషన్కార్డుల జారీలో ఆలస్యం అయిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, వైస్ ఎంపీపీ మంగ, ఆర్డీవో సిడాం దత్తు, తహసీల్దార్ ఏజాజ్ హుస్సేన్, ఎంపీడీవో శశికళ, తదితరులు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతికి పెద్దపీట ..
రెబ్బెన, జూలై 26 : మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు రేషన్కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్డీవో సిడాం దత్తు, తహసీల్దార్ రియాజ్అలీ, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఏఎంసీ చైర్పర్సన్ పర్లపల్లి వనజ, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సం జీవ్, వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చెన్న సోమశేఖర్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపసర్పంచ్ల సం ఘం అధ్యక్షుడు మడ్డి శ్రీనివాసగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, ఆలయ చైర్మన్ వోల్వోజి వెంకటాచారి, కో ఆప్షన్మెంబర్ జౌరొద్దీన్, సర్పంచ్ బొమ్మినేని అహల్యాదే వి, ఎంపీటీసీ పెసరి మధునయ్య, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే ఆత్రం సక్కు
తిర్యాణి, జూలై 26 : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ రాజేశం సూచించారు,. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి రేషన్ కార్డు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మండలంలో 77 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, తహసీల్దార్ మల్లిఖార్జున్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఎంపీటీసీ రాజ్యలక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు హన్మాండ్ల జగదీశ్, సర్పంచ్లు, లబ్ధిదారులు ఉన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి : ఎమ్మెల్యే కోనప్ప
కాగజ్నగర్ టౌన్, జూలై 26 : అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి రేషన్ కార్డు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు ఇచ్చిందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్డీవో చిత్రు, డీసీఎస్వో స్వామికుమార్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్కుమార్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, తహసీల్దార్ ప్రమోద్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్,రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నజ్రూల్నగర్లో..
కాగజ్నగర్ రూరల్, జూలై 26 : మండలంలోని నజ్రుల్నగర్ విలేజ్ నంబర్ 12లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో కలిసి రేషన్ కార్డుల పత్రాలను పంపిణీ చేశారు. మండలంలో 1084 మంది లబ్ధిదారులకు కార్డులను అందజేశామన్నారు. అనంతరం 179మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రమోద్కుమార్, ఎంపీపీ చీపురుశెట్టి శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఉమామహేశ్వర్రావు, వైస్ ఎంపీపీ స్వదేశ్ శర్మ, సర్పంచ్ గోకుల్ రాయ్, ఎంపీటీసీ బిస్వాస్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, రాములు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
దహెగాంలో రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
దహెగాం, జూలై 26: మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు తహసీల్దార్ రామ్మోహన్రావుతో కలిసి 41 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 91 మందికి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, సింగిల్విండో చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్ఐ మోహన్, సర్పంచ్లు పుప్పాల లక్ష్మి, బండ కృష్ణ, ఎంపీటీసీ శంకర్, నాయకులు ప్రసాద్రాజ్, హట్కరి మధుకర్, జర్పుల కృష్ణ, పుప్పాల సంతోష్, తుమ్మిడ పాపయ్య, రౌతు రాజన్న, నక్క సునీల్, తదితరులు పాల్గొన్నారు.