నేరడిగొండ, మే 26 : జిల్లాలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీఎంవో శ్రీధర్ పేర్కొన్నారు. మండలంలోని ఆరెపల్లి గ్రామంలోబుధవారం నిర్వహించిన మలేరియా సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. 173 ఇళ్లలో సర్వే చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అనంతరం నమోదు వివరాల రిజిస్టర్ను పరిశీలించారు. ఆయన వెంట ఎన్సీడీ క్రాంతికుమార్, మండల వైద్యాధికారి ఆనంద్కుమార్, హెచ్ఈవో హరికుమార్గౌడ్, వైద్య సిబ్బంది నర్సయ్య, శ్రీనివాస్రెడ్డి, సాయన్న, నరేందర్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, ఏఎన్ఎం విజయలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.
మలేరియా ప్రభావిత గ్రామాల్లో సర్వే
నార్నూర్, మే 26: మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని హెచ్ఈవో చౌహాన్ నాందేవ్ అన్నారు. మండలంలోని రాజుల్గూడ, కొత్తపల్లి(హెచ్)లోని ఎస్సీగూడలో నార్నూర్ పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళల్లో మలేరియాకు గురైన వారిని గుర్తించేందుకు రక్త నమూనాలు సేకరిస్తున్నామన్నారు. లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారణలో తెలితే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో గోకుల్, జవహర్, శ్యాంకా, సిబ్బంది పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మే 26: కరోనా లక్షణాలు ఉన్న వారి కోసం చేపట్టిన ఇంటింటా ఆరోగ్య సర్వే మండలంలో కొనసాగుతున్నది. మండలంలోని బలాన్పూర్ గ్రామంలో దంతన్పెల్లి పీహెచ్సీ వైద్యురాలు అనురాధ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందులు అందజేసి వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఈ సత్యనారాయణ, సూపర్వైజర్ నూర్సింగ్, ఎంపీహెచ్ఎస్ ప్రమోద్, ఎల్లవ్వ, ఏఎన్ఎం లక్ష్మి పాల్గొన్నారు.