కాగజ్నగర్లో మహంకాళి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప దంపతులు
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూజలు
కాగజ్నగర్టౌన్, జూలై 25 : పట్టణంలోని సర్సిల్క్ ఎఫ్ కాలనీలో మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం బోనాల సందడి నెలకొన్నది. ఆయా ప్రధాన వీధుల గుండా మహిళలు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సతీమణి రమాదేవి, తనయుడు వంశీకృష్ణ, కూతురు కోనేరు ప్రతిమ, కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నివాసం నుంచి డప్పు చప్పుళ్ల నడుమ పట్టు వస్ర్తాలు, బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు సుభిక్షింగా ఉండాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా బోనాల క మిటీ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ కూడా అమ్మవారికి పట్టు వ్రస్తా లు, బోనాలు సమర్పించారు. ఆయా ప్రధాన వీధు ల గుండా మహిళలు బోనాలతో ఆలయానికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల కమిటీ స భ్యులు రాజ్కుమార్, సోమనాథం, జగదీశ్, ఓంప్రకాశ్, శ్రీనివాస్, వెంకటేశ్, సంజయ్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
24 వార్డులో..
బెల్లంపల్లి టౌన్, జూలై 25 : పట్టణంలోని 24వ వార్డులోని బోనాల జాతరలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత,వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి అమ్మవార్లను బోనాలను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, దామెర శ్రీనివాస్, కొక్కెర చంద్రశేఖర్, రాజనాల కమల, తుంగపల్లి సుజా త, నాయకులు నెల్లికంటి శ్రీధర్, రాజనాల రమేశ్, తుంగపల్లి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్లో..
ఆసిఫాబాద్,జూలై25: జిల్లా కేంద్రంలో భక్తులు పోచమ్మకు బోనాలు సమర్పించారు. పిల్లపాపలతో సుఖ సంతోషంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.
మడేలయ్యకు ..
దండేపల్లి, జూలై 25 : మాదాపూర్ గ్రామంలో రజకుల ఆరా ధ్య దైవం మడేలయ్యకు కులస్తులు పూజలు నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యాలు సమర్పించారు.